జీకేవీధి ఏకలవ్య విద్యార్థి ఆకస్మిక మృతి

జీకేవీధి ఏకలవ్య పాఠశాల విద్యార్థి ఆకస్మికంగా మృతి చెందారు. కొయ్యూరు మండలం తోటిమామునిపాలెం గ్రామానికి చెందిన దీపక్ ఏకలవ్యలో 7వ తరగతి చదువుతున్నాడు. నిన్న జ్వరం రావడంతో పాఠశాల వైద్య సిబ్బంది జీకేవీధి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. గురువారం కూడా ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఊపిరి అందక ఇబ్బంది పడినట్లు చింతపల్లిలో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు ప్రిన్సిపల్ రమణారావు తెలిపారు.

