ఇవాళ నుంచి ధవళేశ్వరం కాలువలకు నీటి విడుదల

AP: ఖరీఫ్ సీజన్కు సాగునీటి సరఫరాపై తూర్పుగోదావరి జిల్లా నీటిపారుదల సలహా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. మే 31వ తేదీ నుంచి ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కాలువలకు నీటిని విడుదల చేయనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. కాలువల రిపేర్ పనులు జరుగుతున్నందు వల్ల, పరిస్థితిని బట్టి విడదల వారీగా వివిధ కాలువలకు నీటిని విడుదల చేస్తామని చెప్పారు.



