కేక్ కటింగ్లు వద్దు..సేవా కార్యక్రమాలే మేలు: KTR

TG: తన 50వ జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించుకున్నారు. దిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్, పేపర్ లీకేజీలపై ఆందోళన చేస్తున్న యువతకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు, కేక్ కటింగ్లు, బొకేలపై అనవసర ఖర్చులు చేయవద్దన్నారు. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడం, సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.



