కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్ ఇవాళ సమావేశమైంది. ప్రధాని సూర్య సరోవర్ యోజనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నీటిపై ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్, ఇంధన నిల్వ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన పథకం ఇది. ఈ పథకం కోసం రూ.5070 కోట్లు కేటాయిస్తారు. దీనిద్వారా ఐదేళ్లలో 5 వేల మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతోపాటు ఖేలో ఇండియా పథకానికి రూ.29 వేల కోట్లు కేటాయించనున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఐదేళ్లకు పొడిగించి, దానికి రూ.3,15,614 కోట్లు కేటాయించారు.



