పూజలు చేస్తూ పూజారి మృతి.. అసలేం జరిగింది?

నల్గొండ జిల్లా తిరుమలగిరిసాగర్ మండలం ఘోర ఘటన చోటుచేసుకుంది. తలపాలెంలో గణేశ్ మండపంలో పూజలు చేస్తూ పూజారి ఉప్పల దత్తు ప్రసాద్ మృతి చెందారు. పూజల విషయంలో గుండాల రవి, పున్నయ్యతో వివాదం జరిగిన అనంతరం దత్తు ప్రసాద్ వారి మండపానికి వెళ్లి పూజలు చేస్తుండగా స్పృహతప్పి పడిపోయారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



