పరీక్షల వ్యవస్థలో మార్పుకు నీలేకని సారధ్యంలో టీమ్

పరీక్షల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీలకు చెక్ పెడుతూ, ట్రాన్స్ పరెన్సీ పెంచేందుకు నందన్ నీలేకని అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూనేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరును మెరుగు పరచడం, అక్రమాలకు తావులేకుండా పక్కా భద్రతా చర్యలను సిఫార్సు చేయడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యం.



