ఏనుగు పిల్లను చూసేందుకు వెళ్లి.. కాళ్ళ కిందపడి వ్యక్తి మృతి
జార్ఖండ్ రాష్ట్రం రామ్గఢ్ గోబర్దరహా ఫారెస్ట్ ఏరియాలో దారుణ ఘటన జరిగింది. నవజాత (ఇప్పుడే పుట్టిన) ఏనుగు పిల్లను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి వెళ్లారు. కొందరు దగ్గరగా వెళ్లి వీడియోలు, రీల్స్ తీసేందుకు ప్రయత్నించారు. దీంతో పిల్లకు దగ్గరలో ఉన్న తల్లి ఏనుగు జనంపైకి దూసుకొచ్చింది. భయంతో పారిపోతుండగా యశ్వంత్ మహతో అనే యువకుడి బైక్ కంట్రోల్ తప్పి పడిపోయాడు. ఏనుగు కాళ్ళ కింద పడడంతో ఆ వ్యక్తి మరణించాడు.



