గుజరాత్ ను కుదిపేస్తున్న భారీ వర్షాలు !
గ్యాప్ లేకుండా పడుతున్న కుండపోత వర్షాలకు గుజరాత్ అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా సూరత్, వల్సాడ్, నవసారి జిల్లాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ఇళ్లు, రోడ్లు పూర్తిగా మునిగిపోయాయి. అహ్మదాబాద్-ముంబై రైల్వే ట్రాక్ వరద నీటిలో చిక్కుకోవడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అహ్మదాబాద్, వడోదర సిటీల్లో డ్రైనేజీలు పొంగి జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని సమీక్షించిన సీఎం భూపేంద్ర పటేల్ రెస్క్యూ టీమ్స్ను రంగంలోకి దించారు. వల్సద్ లో 16 గంటల్లో వెయ్యి మి.మీటర్ల వర్షం పడింది.



