← Back to news

ఉద్దేశపూర్వకంగానే అపోహలు సృష్టిస్తున్నారు: లోకేష్

By DK· 10 Jun 2026· Dishadaily· విశాఖపట్నం జిల్లా
ఉద్దేశపూర్వకంగానే అపోహలు సృష్టిస్తున్నారు: లోకేష్

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. కొందరు కార్మిక సంఘాల నేతలు కావాలనే ఉద్దేశపూర్వకంగా అపోహలు సృష్టిస్తున్నారని ఆయన ఫైరయ్యారు. ప్రమాదంలో మరణించిన శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు ఒకే తరహా సాయాన్ని మంత్రి ప్రకటించారు. మృతుల కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం, వారి పిల్లల చదువుకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. బాధిత కుటుంబాలకు స్టీల్ ప్లాంట్లోనే క్వార్టర్స్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.

ఉద్దేశపూర్వకంగానే అపోహలు సృష్టిస్తున్నారు: లోకేష్

More in AP