గుత్తికొండలో ఘనంగా ఉర్సు ఉత్సవాలు

AP: పల్నాడు జిల్లా గుత్తికొండలో హజరత్ సయ్యద్ షా వలి బాషా ఖాద్రి రహమతుల్లా అలైహి ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఆనవాయితీగా జరిగే వేడుకలకు భక్తులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఉరుసు ఉత్సవాల్లో వివిధ మతాలకు చెందిన ప్రజలు పాల్గొని ఐక్యతను చాటారు. ఉరుసు సందర్భంగా నిర్వహించిన ఖవ్వాలి, ఆర్కెస్ట్రా కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారుల పాటలు, సంగీతంతో ఉత్సవ ప్రాంగణం సందడిగా మారింది.



