సెప్టెంబర్ 12న రెండు తరాల కవిసంగమం

TG: కవిసంగమం ఆధ్వర్యంలో రెండుతరాల కవులను ఒకే వేదికపై తీసుకువచ్చే ప్రత్యేక కవిసమ్మేళనం ‘రెండుతరాల కవిసంగమం – సిరీస్-47’ సెప్టెంబర్ 12, 2026న జరుగుతోంది. ఈ కార్యక్రమం హైదరాబాద్లోని కోఠి, సుల్తాన్బజార్(రాంకోటి)లో ఉన్న శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయంలో సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. రెండు తరాలకు చెందిన కవులు కాంచనపల్లి గోవర్ధన్రాజు, ఫణిమాధవి కన్నోజు, గంగిరెడ్డి విశ్వనాథరెడ్డి, దండు వెంకట్రాములు, స్వప్న కొండమడుగు తమ కవిత్వాన్ని వినిపిస్తారు.



