ప్రతి 10 మందిలో 9 మందికి రక్తంలో కొవ్వు సమస్య: ICMR

భారతీయుల ఆరోగ్యంపై 'ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్-ఇండియా డయాబెటిస్' చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దేశంలో ప్రతి 10 మంది పెద్దవారిలో తొమ్మిది మంది 'డైస్లిపిడెమియా'(రక్తంలో కొవ్వుల అసాధారణ నిష్పత్తి) సమస్యతో బాధపడుతున్నారని తెలిపింది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం, మంచి కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఈ సమస్య సిటీలో 89%, గ్రామీణ ప్రాంతాల్లో 86.5% విస్తరించి ఉందని, పురుషుల కంటే మహిళల్లోనే దీని తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.



