కృష్ణా జలాలతో పాలమూరును పచ్చగా మారుస్తా: రేవంత్రెడ్డి

TG: కృష్ణా జలాలతో మహబూబ్నగర్ జిల్లాలోని పంటలను పచ్చగా కలకలలాడేలా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండురోజుల పర్యటనలో భాగంగా ఫస్ట్ డే కోయిల్ సాగర్ ప్రాజెక్ట్, కృష్ణా, బీమా నదులపై ప్రతిపాదించిన కొత్త బ్యారేజీల స్థలాలు, జూరాల ప్రాజెక్టు డ్యాంను సీఎం వీక్షించారు. ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులు, నీటినిల్వల సామర్ధ్యాలను ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మక్తల్, కొడంగల్ ఎత్తిపోతల పథకాల పరిధిలోని పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో సీఎం పరిశీలించారు.



