కైట్ ఎగరేస్తుండగా కరెంటు తీగకు తగిలింది.. ఏమైందంటే?
దిల్లీలోని కొండ్లి ప్రాంతంలో విషాద ఘటన జరిగింది. టెర్రస్పై గాలిపటం (కైట్) ఎగరేస్తున్న ఓ బాలుడి గాలిపటం దారం కరెంటు తీగను తాకడంతో ఎలక్ట్రిక్ షాక్కు గురై గాయాలయ్యాయి. దీంతో పేరెంట్స్, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎలక్ట్రిక్ ఓవర్హెడ్ లైన్లకు దగ్గరలోని టెర్రస్లు, భవనాలపై గాలిపటాలు ఎగరేయకూడదు. ముఖ్యంగా మెటల్తో ఉన్న దారాలు, మాంజాను అసలు వాడకూడదు. చిన్న నిర్లక్ష్యం ప్రాణాలకే ప్రమాదంగా మారే అవకాశముంది.



