← Back to news

విజయవాడలో డయేరియా కలకలం

By DK· 18 Jul 2026· విజయవాడ
విజయవాడలో డయేరియా కలకలం

AP: విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని గిరిపురంలో డయేరియా కలకలం రేపుతోంది. రెండు వీధులకు చెందిన సుమారు 20 మంది డయేరియా బారిన పడగా, పలువురు చికిత్స పొందుతున్నారు. కుళాయిల ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతుండటమే దీనికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. గురువారం రాత్రి ఒకేసారి ఐదుగురు డయేరియా బాధితులను గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం రెండేళ్ల చిన్నారికి తీవ్ర విరోచనాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని, హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందించాలని కోరారు.

More in Health