తెలంగాణ పోరాట యోధులకు పవన్ నివాళి

AP: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ పోరాట యోధులకు, అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్య రాసిన “ఓ నిజాము పిశాచమా... నా తెలంగాణ కోటి రతనాల వీణ” అనే కవితా పంక్తులను ఆయన గుర్తుచేసుకున్నారు. నిజాం అణచివేతకు, రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన వీరనారీమణులకు, వీరులకు పవన్ కళ్యాణ్ అంజలి ఘటించారు.



