‘అక్కడ నీళ్లు రావాల్సిందే’..చర్చగా మారిన ఉదయనిధి కామెంట్స్
తంజావూరులో కావేరి నిరసన సభలో ప్రతిపక్షనేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘కావేరి నీళ్ల గురించి సీఎం విజయ్ నోరు విప్పడం లేదు. ఆయనకు డీఎంకేపై తప్పుడు కేసులు పెట్టడమే ముఖ్యం’ అని ఉదయనిధి ఆరోపించారు. ఆ టైంలో సభలోని వాళ్లు “త్రిష… త్రిష…” అని నినాదాలు చేశారు. ఉదయనిధి నవ్వుతూ “ఎక్కడ నీళ్లు వచ్చినా రాకపోయినా, అక్కడ నీళ్లు రావాలి” అని కామెంట్ చేశారు. ఆ తర్వాత “నేను కావేరి నీళ్ల గురించే చెప్పాను” అని క్లారిఫై చేశారు.


