బస్సు టికెట్ తో పాటే 'ఆటో రైడ్' బుకింగ్..

TGSRTC బస్సు ప్రయాణికులకు శుభవార్త అందిస్తూ 'ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ' కోసం ఈ-ఆటో సేవలకు శ్రీకారం చుట్టింది. ప్రయాణికులు ఇంటి నుంచి బస్టాప్కు, అలాగే బస్సు దిగాక తమ గమ్యస్థానానికి సులభంగా చేరుకోవడానికి బస్ టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే తక్కువ ఛార్జీలతో ఈ-ఆటో రైడ్ను కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ నూతన విధానాన్ని మొదట హైదరాబాద్లో పరిశీలించి, ఆ తర్వాత వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి నగరాలకు విస్తరించనున్నారు.



