చరిత్రలో తొలిసారి వందేమాతరం..ఎర్రకోట ముస్తాబు

దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారత్ సిద్ధమైంది. శనివారం ఆగస్టు 15న న్యూదిల్లీలోని ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 13వసారి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. తరువాత జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ఈసారి వేడుకల్లో తొలిసారిగా వందేమాతరం గేయాన్ని ఆలపించనున్నారు. మరోవైపు ఎర్రకోట పరిసరాల్లో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. వెయ్యి సీసీటీవీ కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలతో నిఘా పెంచారు.



