అడవి ఏనుగులను అదుపు చేసేందుకు కుంకీ ఏనుగులు
AP: విజయనగరం, మన్యం జిల్లాల్లో పంటలను నాశనం చేస్తున్న అడవి ఏనుగులను అదుపు చేసేందుకు కుంకీ ఏనుగులను పంపుతున్నట్లు డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. మంగళగిరి వద్ద కుంకీ ఏనుగులను ఆయన పరిశీలించారు. వీటిని పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపుకు తరలిస్తున్నారు. ఒడిశాతో చర్చలు జరిపి మరికొన్ని కుంకీలను రప్పించాలని అధికారులను పవన్ ఆదేశించారు.



