వీరయ్య - మరువలేని చరిత్రకి పుస్తక రూపం

కృష్ణ గుబిలి రాసిన ‘వీరయ్య’ పుస్తకం మరుగున పడ్డ చరిత్ర. అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా తెలుగులో వచ్చిన ఈ రచన రచయిత ముత్తాత జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చిత్రీకరిస్తుంది. 19వ శతాబ్దం చివర్లో సౌత్ ఆఫ్రికా చెరుకు తోటలకు కూలీలు అవసరమయ్యారు. 13 లక్షల మంది భారతీయులను బ్రిటీష్ వాళ్లు సముద్రం దాటించారు. వాళ్లలో ఒకరు కృష్ణా జిల్లా కొర్లపాడుకు చెందిన వీరయ్య. అక్కడ తోటల్లో వాళ్ల జీవితం..ఆపై 1932లో ఆయన తిరిగి ఈ దేశానికి వచ్చాక జరిగిన విషయాల గురించి ఈ పుస్తకం వివరిస్తుంది. ధర.300. కొనే <a href="https://www.telugubooks.in/products/viriah?srsltid=AfmBOoqz_4iNbW8x6s5-hNBpPGv082K1uEXzp-WQbQnto-XGVIWu8-VG">లింక్</a> ఇది.



