← Back to news

పొరండ్ల గ్రామంలో ఆరోగ్యశాఖ హైఅలర్ట్

By DK· 25 Jul 2026· జగిత్యాల జిల్లా
పొరండ్ల గ్రామంలో ఆరోగ్యశాఖ హైఅలర్ట్

TG: జగిత్యాల జిల్లా పొరండ్ల గ్రామంలో విషజ్వరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వైరల్ ఫీవర్ బారిన పడి వరుణ్‌తేజ్‌ (6), హార్‌స్మిత్‌ (6) అనే ఇద్దరు చిన్నారులు రెండు రోజుల వ్యవధిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇద్దరూ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమై ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇంటింటికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.

More in Health