129 బోగీలు, 3 ఇంజిన్లు… ‘ఆవధ్ మహాశక్తి’

భారత రైల్వేలో ఒకేసారి 129 బోగీలు, 3 ఇంజిన్లతో నడిచిన ‘ఆవధ్ మహాశక్తి’ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నార్త్ ఈస్టర్న్ రైల్వే మూడు గూడ్స్ ట్రైన్లను కలిపి ఈ భారీ ఫ్రైట్ ట్రైన్ను నడిపింది. గోండా నుంచి సీతాపూర్ మీదుగా మురాదాబాద్ వైపు వెళ్లిన ఈ రైలు సుమారు 160 కి.మీ ప్రయాణించింది. సగటున గంటకు 42 కి.మీ వేగంతో ఈ దూరాన్ని 3 గంటల 50 నిమిషాల్లో పూర్తి చేసింది. ఒకే ట్రిప్లో ఎక్కువ సరుకును తరలించడం వల్ల సమయం, ఇంధనం, రైల్వే వనరులను మరింత సమర్థంగా ఉపయోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.



