← Back to news

129 బోగీలు, 3 ఇంజిన్లు… ‘ఆవధ్ మహాశక్తి’

By Nani Garikina· 22 Aug 2026· Indianexpress
129 బోగీలు, 3 ఇంజిన్లు… ‘ఆవధ్ మహాశక్తి’

భారత రైల్వేలో ఒకేసారి 129 బోగీలు, 3 ఇంజిన్లతో నడిచిన ‘ఆవధ్ మహాశక్తి’ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నార్త్ ఈస్టర్న్ రైల్వే మూడు గూడ్స్ ట్రైన్లను కలిపి ఈ భారీ ఫ్రైట్ ట్రైన్‌ను నడిపింది. గోండా నుంచి సీతాపూర్ మీదుగా మురాదాబాద్ వైపు వెళ్లిన ఈ రైలు సుమారు 160 కి.మీ ప్రయాణించింది. సగటున గంటకు 42 కి.మీ వేగంతో ఈ దూరాన్ని 3 గంటల 50 నిమిషాల్లో పూర్తి చేసింది. ఒకే ట్రిప్‌లో ఎక్కువ సరుకును తరలించడం వల్ల సమయం, ఇంధనం, రైల్వే వనరులను మరింత సమర్థంగా ఉపయోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 7h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.