ప్లాస్టిక్ తో కోట్లు సంపాదిస్తున్నారు!

భారత్లో రీసైక్లింగ్ బిజినెస్ రూపురేఖలు వేగంగా మారుతున్నాయి. ముంబైలో జరిగిన రీసైక్లింగ్ షోలో ఎక్స్పర్ట్స్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో క్వాలిటీ, మోడ్రన్ టెక్నాలజీయే ఈ రంగానికి కీలకం కానున్నాయని చెప్పారు. గవర్నమెంట్ రూల్స్, మెటీరియల్ రికవరీ పెరుగుతుండటంతో కంపెనీలు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ప్యాకేజింగ్, కార్ల తయారీ వల్ల ప్లాస్టిక్ రీసైక్లింగ్కు డిమాండ్ పెరిగింది. అలాగే మెటల్ స్క్రాప్, ఈ-వేస్ట్, బ్యాటరీ రీసైక్లింగ్ రంగాలు పక్కా ప్లానింగ్తో ఆర్గనైజ్డ్ సెక్టార్గా మారుతున్నాయని తెలిపారు.



