← Back to news

పంట దిగుబడి రాక.. అప్పులు తీర్చలేక

By dk· 4 Aug 2026· మార్కాపురం జిల్లా
పంట దిగుబడి రాక.. అప్పులు తీర్చలేక

AP: మార్కాపురం జిల్లా పెద్దకందుకూరు గ్రామంలో అప్పుల భారంతో మనస్తాపానికి గురైన రైతు కోడావత్ పెద్ద రామయ్య (46) చికిత్స పొందుతూ మృతి చెందాడు. మూడు ఎకరాల సొంత భూమితో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేసిన ఆయనకు గత కొన్నేళ్లుగా పంట దిగుబడి రాక, గిట్టుబాటు ధరలు లేక తీవ్ర అప్పులు అయ్యాయి. మనస్తాపంతో గత నెల 23న పొలం వద్ద పురుగుల మందు తాగగా, కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. గుంటూరులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

More in AP