← Back to news

ఒక్క ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం లేదా?

By Balakrishna· 23 Jul 2026

TG: ఉస్మానియా యూనివర్సిటీలో ఓ విద్యార్థిని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తాము ఏ రాజకీయ పార్టీ కాదని, కేవలం తమ హక్కుల కోసం, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసమే పోరాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎం మోదీ ఇప్పటివరకూ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. తమిళనాడు వెళ్ళగానే రూపం, మాటలు మారుస్తూ నటనలు చేయడం తప్ప విద్యార్థుల సమస్యలపై కనీసం ఎందుకు మాట్లాడటం లేదని ఆమె ప్రశ్నించారు.

More in News