చిన్నారి కుటుంబానికి అండగా ఉంటాం: హోంమంత్రి

AP: కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారంలో మిస్సైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని AP హోంమంత్రి అనిత పరామర్శించారు. కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. చిన్నారి అదృశ్యం దర్యాప్తు పురోగతిని జిల్లా ఎస్పీ బిందుమాధవ్తో మాట్లాడి తెలుసుకున్నారు. 11 రోజులుగా చేపట్టిన గాలింపు చర్యలను మంత్రికి SP వివరించారు. అనంతరం బాలిక అదృశ్యమైన ప్రదేశానికి అనిత వెళ్లి పరిశీలించారు. అడవి జంతువులు వచ్చే అవకాశముందా? అని ఆరా తీశారు. అటవీశాఖ అధికారులు కెమెరాలు, డ్రోన్ల ద్వారా పరిశీలిస్తున్నారని పోలీసులు మంత్రికి వివరించారు.




