← Back to news

నర్మాల ప్రాజెక్టుకు పూర్వ వైభవం తేవాలి: చాడ

By dk· 15 Aug 2026· రాజన్నసిరిసిల్ల జిల్లా
నర్మాల ప్రాజెక్టుకు పూర్వ వైభవం తేవాలి: చాడ

TG: రాజన్నసిరిసిల్ల జిల్లాలోని నర్మాల ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని CPI నాయకుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల రైతులకు జీవనాడిగా ఉన్న ఈ ప్రాజెక్టు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. 2.2 TMCల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు ప్రస్తుతం భారీగా పూడిక పేరుకుపోవడంతో సుమారు 1.2 TMCలకే పరిమితమైందని తెలిపారు. గతంలో 22–23 వేల ఎకరాలకు సాగునీరు అందించిన ప్రాజెక్టు ప్రస్తుతం రైతుల అవసరాలను తీర్చలేకపోతోందన్నారు.

More in TG