పోషకాలతో నిండిన Fruit Timetable

ఉదయాన్నే అరటిపండు తింటే వెంటనే ఎనర్జీ, పైనాపిల్ తింటే మెటబాలిజం పెరుగుతుంది, అలాగే ఖాళీ కడుపుతో యాపిల్ తింటే అరుగుదల బాగుంటుంది. మధ్యాహ్న పూట ఆరెంజ్, మామిడి, పుచ్చకాయ లాంటివి తింటే శరీరానికి శక్తితో పాటు ఇమ్యూనిటీ పెరుగుతుంది, శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. భోజనం చేశాక బొప్పాయి తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది. రాత్రి పడుకునే ముందు కివీ పండు తింటే మంచి నిద్ర పడుతుంది. పండ్లు తినడం వల్ల గుండె ఆరోగ్యం పెరిగి స్కిన్ బాగా గ్లో అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.



