ఉద్యోగం రాలేదని గోల్డ్ మెడల్ విద్యార్థి ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లో బీటెక్(ఎలక్ట్రికల్)లో గోల్డ్ మెడల్ సాధించి, రాష్ట్రంలో మూడో ర్యాంక్ సాధించిన ఆనంద్(23) ఆత్మహత్య చేసుకున్నాడు. పవర్గ్రిడ్లో అప్రెంటిస్షిప్ పూర్తి చేసి, ప్రభుత్వ ఉద్యోగం కోసం రైల్వేస్, బ్యాంకులు, SSC రిక్రూట్మెంట్ పరీక్షలు రాశాడు. అయినా ఉద్యోగం రాలేదు. దీంతో మనస్తాపం చెందాడు. "సారీ నాన్నా..ప్రభుత్వ ఉద్యోగం కోసం 50 సార్లు ప్రయత్నించినా సాధించలేకపోయాను. నన్ను క్షమించండి" అని సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.



