← Back to news

ఒక్క నెలలో..60 మంది నవజాత శిశువులు మృతి

By Vishi· 27 Aug 2026· Deccanherald
ఒక్క నెలలో..60 మంది నవజాత శిశువులు మృతి

పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఆగస్టులో 60 నవజాత శిశువులు చనిపోయారు. ఇందులో 10 మంది ఆగస్టు రెండో వారంలోనే చనిపోయారు. 60 మందిలో 44 మంది ఇతర హాస్పిటల్స్ లేదా నర్సింగ్ హోమ్‌ల నుంచి క్రిటికల్ కండీషన్లలో ఇక్కడికి తీసుకొచ్చారు. మిగిలిన 16 మంది ఈ హాస్పిటల్లోనే పుట్టారు. వాళ్లు ఇక్కడికి రావడానికి ముందే అనారోగ్యంతో ఉన్నారని, అందుకే మరణించారని హాస్పిటల్ వర్గాలు చెప్తున్నాయి. జిల్లా అధికారులు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాయి.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 4h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.