అమెరికాలో AP యువకుడు మృతి

AP: కర్నూలు జిల్లా కౌతాళం మండలం రాజానగర్ క్యాంప్కు చెందిన సాయికార్తీక్ వర్మ అమెరికాలోని 'యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీ'లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇటీవలే అక్కడ ఒక మంచి ఉద్యోగంలో చేరాడు. వీకెండ్ కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా స్కెడైవింగ్ చేయడానికి వెళ్లాడు. స్కెడైవర్లను తీసుకెళ్లే 'పసిఫిక్ ఏరోస్పేస్ P750' రకానికి చెందిన చిన్న విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపంతో అదుపుతప్పి భూమిపైకి కుప్పకూలింది. విమానం వేగంగా వచ్చి భూమిని ఢీకొట్టడంతో మంటలు చెలరేగి లోపల ఉన్న 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.



