మెటర్నిటీ సెలవులపై కోర్టు నిర్ణయం

తక్కువ సమయంలోనే రెండోసారి ప్రసవం జరిగిన మహిళలకు మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టు చెప్పింది. రెండు కాన్పుల మధ్య ఇన్ని రోజులు గ్యాప్ ఉండాలన్న రూల్ ఏదీ చట్టంలో లేదని చెప్పింది. ఏడాదిన్నరలోనే రెండోసారి సెలవు అడిగిన ఒక నర్సుకు పర్మిషన్ ఇవ్వకపోవడం తప్పని తెలిపింది. ఆమెను మళ్లీ సెలవులకు అప్లికేషన్ పెట్టుకొమని చెప్పి, దానికి అధికారులను అనుమతి ఇవ్వాలని ఆదేశించింది.



