ముందు మీ స్కామ్స్పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టండి: కపిల్
నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసే ముందు అధికార పార్టీలో స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ కేసుల్లో సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించారు. జూన్ 28 నుంచి విద్యార్థుల నిరసనలు 25 రోజులుగా కొనసాగుతున్నా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించలేదని, నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థుల ఆరోగ్యంపైనా నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు.



