నేపాల్ వరదల్లో 80 మంది గల్లంతు.. కన్నీరుపెట్టుకున్న సద్గురు

నేపాల్–టిబెట్ బోర్డర్లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. కైలాశ్ మానస సరోవర్ యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 80 మంది సభ్యులు మిస్ అయ్యారు. వరదల్లో దాదాపు 170 మంది మృతి చెందగా, 1,500 మందికి పైగా ఆచూకీ తెలియకుండా పోయింది. దీంతో ఘటనపై సద్గురు కన్నీరుపెట్టుకున్నారు. ఈరోజు అక్కడికి వెలదామనుకున్నా కుదరలేదని అన్నారు. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనేందుకు సద్గురు, తన టీమ్తో అక్కడికి వెళ్లేందుకు భారత్, చైనాల అనుమతి కోరుతున్నారు.




