← Back to news

నేపాల్ వరదల్లో 80 మంది గల్లంతు.. కన్నీరుపెట్టుకున్న సద్గురు

By Mahesh· 27 Aug 2026
నేపాల్ వరదల్లో 80 మంది గల్లంతు.. కన్నీరుపెట్టుకున్న సద్గురు

నేపాల్–టిబెట్ బోర్డర్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. కైలాశ్ మానస సరోవర్ యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న ఇషా ఫౌండేషన్‌కు చెందిన 80 మంది సభ్యులు మిస్ అయ్యారు. వరదల్లో దాదాపు 170 మంది మృతి చెందగా, 1,500 మందికి పైగా ఆచూకీ తెలియకుండా పోయింది. దీంతో ఘటనపై సద్గురు కన్నీరుపెట్టుకున్నారు. ఈరోజు అక్కడికి వెలదామనుకున్నా కుదరలేదని అన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొనేందుకు సద్గురు, తన టీమ్‌తో అక్కడికి వెళ్లేందుకు భారత్, చైనాల అనుమతి కోరుతున్నారు.

నేపాల్ వరదల్లో 80 మంది గల్లంతు.. కన్నీరుపెట్టుకున్న సద్గురు

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 6h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.