కర్ణాటకలో భిక్షగత్తె మృతి…ఇంట్లో ₹8.40 లక్షలు

జీవితాంతం భిక్షాటన చేస్తూ గడిపిన ఓ మహిళ ఇంట్లో లక్షల రూపాయల నగదు దొరికింది. హూర్(68) తన సోదరితో కలిసి అద్దె ఇంట్లో ఉండేవారు. సోదరి రెండేళ్ల క్రితం మరణించారు. వీళ్లిద్దరూ వివాహం చేసుకోలేదు. ఆదివారం హూర్ మరణించింది. తర్వాత ఇంట్లోకి వెళ్లి చూడగా, 10, 20, 50 రూపాయల నోట్లు, వేలాది నాణేలు కలిపి 30కు పైగా సంచుల్లో కనిపించాయి. మొత్తం ₹8,40,000 ఉన్నట్లు గుర్తించారు. అందులో కొంత సోదరులు తీసుకోగా, మిగిలింది మసీదుకు దానం చేశారు.



