మహిళా ఉద్యోగులకు గుడ్న్యూస్.. విజయ్ మరో కీలక నిర్ణయం!

మహిళా ప్రభుత్వ ఉద్యోగుల కోసం తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మూడో బిడ్డకు కూడా 365 రోజుల పెయిడ్ మ్యాటర్నిటీ లీవ్స్ కల్పించనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి డి. సరత్కుమార్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటివరకు మూడో బిడ్డకు 12 వారాల సెలవు మాత్రమే ఉండేది. మొదటి ఇద్దరు పిల్లలకు వర్తించే 365 రోజుల సెలవులను మూడో బిడ్డకూ కూడా ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులు డెలివరీ తర్వాత శిశు సంరక్షణకు ఈ నిర్ణయం మరింత తోడ్పడనుంది.



