గడ్డి మందు నిషేధంపై హైకోర్ట్లో పిటిషన్

AP: పారాక్వాట్ డైక్లోరైడ్ 24% SL అనే గడ్డి మందు చాలా డేంజర్ అంటూ ఫిర్యాదులు రావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నిషేధించిన విషయం తెలిసిందే. ఇటీవల AP రాష్ట్ర వ్యవసాయశాఖ 60రోజులపాటు గడ్డిమందును నిషేధిస్తూ జారీ చేసిన GOను సవాల్ చేస్తూ ఫెర్టిలైజర్స్, సీడ్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట నాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పారాక్వాట్ తయారీ, పంపిణీ, విక్రయానికి అనుమతిచ్చేలా ఆదేశించాలని పిటిషన్లో నాగిరెడ్డి హైకోర్టును కోరారు. గవర్నమెంట్ ముందుగా తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిషేధం విధించిందని ఆయన పిటిషన్లో పేర్కొన్నాడు.



