← Back to news

79లోనూ పని ఆపని వ్యక్తి కథ!

By Nani Garikina· 26 Aug 2026· Hindustantimes
79లోనూ పని ఆపని వ్యక్తి కథ!

79 ఏళ్ల వయసులోనూ రోజూ సైకిల్‌పై పార్సల్స్ ఇస్తున్న ఓ వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన సీకే ముఖర్జీ గత 33 ఏళ్లుగా కొరియర్ పని చేస్తున్నారు. ఎండైనా, వానైనా సైకిల్‌పై తిరుగుతూ పార్సల్స్ అందిస్తున్నారు. ఇంత వయసులోనూ ఇలా ఎలా పనిచేస్తున్నారని అడిగితే.. తనకు జనాలు ఇచ్చే ప్రేమ, గౌరవమే ముందుకు వెళ్లే బలమని చెప్పారు. ఇటీవల రెండు కళ్లకు ఆపరేషన్ జరిగినా పని ఆపలేదు. కుటుంబాన్ని చూసుకోవడానికి కూడా ఈ పని కొనసాగిస్తున్నానని చెప్పారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 4h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.