79లోనూ పని ఆపని వ్యక్తి కథ!

79 ఏళ్ల వయసులోనూ రోజూ సైకిల్పై పార్సల్స్ ఇస్తున్న ఓ వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. జార్ఖండ్లోని జంషెడ్పూర్కు చెందిన సీకే ముఖర్జీ గత 33 ఏళ్లుగా కొరియర్ పని చేస్తున్నారు. ఎండైనా, వానైనా సైకిల్పై తిరుగుతూ పార్సల్స్ అందిస్తున్నారు. ఇంత వయసులోనూ ఇలా ఎలా పనిచేస్తున్నారని అడిగితే.. తనకు జనాలు ఇచ్చే ప్రేమ, గౌరవమే ముందుకు వెళ్లే బలమని చెప్పారు. ఇటీవల రెండు కళ్లకు ఆపరేషన్ జరిగినా పని ఆపలేదు. కుటుంబాన్ని చూసుకోవడానికి కూడా ఈ పని కొనసాగిస్తున్నానని చెప్పారు.



