చూపు లేకపోయినా... ఈ యాప్ ఉంటే చాలు!

కంటిచూపు, వినికిడి సమస్యలు ఉన్నవారికి సాయపడేలా కొత్త యాప్స్ వచ్చాయి. బెంగళూరుకు చెందిన రుక్మణి ఛేత్రీ, తరుణ్ సర్వాల్ ప్రారంభించిన 'సైన్ఏబుల్' యాప్ ద్వారా వినికిడి లోపం ఉన్నవారు వీడియో కాల్స్లో సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రీటర్స్ సాయం పొందుతున్నారు. దీనికి నెలకు రూ.499 లేదా 30 నిమిషాలకు రూ.75 చార్జ్ చేస్తారు. అలాగే 'బీ మై ఐస్' యాప్ బ్లైండ్ యూజర్లను వాలంటీర్లతో లైవ్ వీడియో కాల్స్ ద్వారా కనెక్ట్ చేస్తూ రోడ్డు దాటడం, షాపింగ్ చేయడంలో వాలంటీర్లు సాయం చేస్తున్నారు.



