విశాఖ టెకీ అనుమానాస్పద మృతి

AP: భర్తతో కలిసి ఉత్తరాఖండ్ టూర్కు వెళ్లిన విశాఖపట్నానికి చెందిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుమానాస్పదంగా మరణించారు. భర్తతో కలిసి టూర్కు వెళ్లిన పి.రాధా గాయత్రి (27) ముస్సోరిలోని ఓ హోటల్ రూమ్లో మరణించినట్లు పోలీసులు గుర్తించారు. ముక్కు నుంచి రక్తం రావడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశాఖలోని చినముషిడివాడకు చెందిన గాయత్రికి శ్రీచరణ్తో గతేడాది నవంబర్ 8న మ్యారేజ్ జరిగింది. ఇద్దరూ గురుగ్రామ్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు.



