← Back to news

కొన్ని క్షణాల్లోనే అంతా కొట్టుకుపోయింది!

By Nani Garikina· 26 Aug 2026· Indiatoday

నేపాల్–టిబెట్ సరిహద్దులో ఒక్కసారిగా మట్టి, రాళ్లు, నీటితో భారీ వరద దూసుకురావడంతో తీవ్ర నష్టం జరిగింది. నేపాల్‌లో ఇప్పటివరకు 95 మంది చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు వందల మంది ఆచూకీ తెలియడం లేదు. ఇళ్లు, రోడ్లు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులు వరదలో కొట్టుకుపోయాయి. కొండపై నుంచి భారీగా మట్టి, రాళ్లు నదిలోకి జారిపడటంతో ఈ వరద మొదలై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి. దెబ్బతిన్న రోడ్ల కారణంగా కొన్ని ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా మారింది.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 4h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.