రిజర్వేషన్ హటావో ఆందోళనపై పోలీసుల సంచలన ప్రకటన

రిజర్వేషన్ హటావో ఆందోళన కారులకు జంతర్ మంతర్లో ధర్నా చేసే పర్మిషన్ లేదని ఢిల్లీ పోలీసులు కీలక ప్రకటన చేశారు. శుక్రవారం రాత్రి జంతర్ మంతర్లో ప్రొటెస్టుకు దిగిన వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అనుమతి ఉందన్న ప్రచారం తప్పు అన్నారు. శాంతిభద్రతల కోణంలోనే జంతర్ మంతర్ ధర్నాకు పర్మిషన్ ఇవ్వలేదనీ.. అయితే రాంలీలా మైదానంలో మాగ్జిమమ్ 500 మందితో పీస్ ఫుల్ ప్రొటెస్టుకు పర్మిషన్ ఇచ్చాం అన్నారు. ఈ రూల్స్ పాటించకుండా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని Xలో ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు.



