రౌడీషీటర్ దాడిలో ఇంటర్ విద్యార్థి హతం

TG: హైదరాబాద్ నగరం కాలాపత్తర్ పరిధిలో ఓ ఇంటర్ విద్యార్థి దారుణహత్యకు గురయ్యాడు. శాలిబండలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఫైజాన్(18) ఆదివారం తెల్లవారుజామున మిత్రులతో కలిసి బిర్యానీషాటెక్రీ కొండ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడకు వచ్చిన బాలాపూర్ రౌడీషీటర్ అబ్రార్, అతని స్నేహితులను తమ బస్తీకి ఎందుకు వచ్చారని ఫైజాన్ అడిగాడు. కోపానికి గురైన గ్యాంగ్ కత్తులతో ఫైజాన్ తల, కడుపులో దారుణంగా పొడిచారు. తీవ్ర గాయాలైన ఫైజాన్ ప్రాణాలు కోల్పోయాడు. పాత కక్షలతోనే ఈ దాడి జరిగిందని కుటుంబసభ్యులు ఆరోపించగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.



