UPIకి 10 ఏళ్లు.. జేబులో డబ్బు ఎందుకు తగ్గిపోయింది?

ఒకప్పుడు టీ తాగాలన్నా జేబులో క్యాష్ ఉందా అని చూసుకునేవాళ్లం.. ఇప్పుడు షాప్లో QR కోడ్ ఉందా అని చూస్తున్నాం! 2016లో మొదలైన UPI పదేళ్లలో మన పేమెంట్ అలవాట్లనే మార్చేసింది. మొదటి ఏడాది 1.78 కోట్లుగా ఉన్న లావాదేవీలు.. 2025-26లో ఏకంగా 24,162 కోట్లకు చేరాయి. అంటే రోజుకు సగటున 66 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. క్యాష్ వెంట తీసుకెళ్లడం తగ్గిపోయింది.. ఇప్పుడు పర్సు మర్చిపోయినా పర్లేదు, ఫోన్ మాత్రం మర్చిపోకూడదనే పరిస్థితి వచ్చింది. మన చేతిలో ఉన్న డబ్బు కన్నా.. ఫోన్పైనే నమ్మకం పెరిగిపోయింది!






