← Back to news

దిల్లీలో పోలీసులపై అటాక్.. కారం పొడి, ఇటుకలతో దాడి!

By Mahesh· 24 Aug 2026· Delhi

దిల్లీలోని ముకుంద్‌పూర్‌లో పోలీసులపై అటాక్ జరిగింది. పెట్రోలింగ్‌లో ఉన్న ముగ్గురు పోలీసులపై కొంతమంది కారం పొడి, ఇటుకలు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. ఓ హెడ్ కానిస్టేబుల్‌కు తలకు గాయమైంది. సరైన డాక్యుమెంట్స్ లేని బైక్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లిన తరువాత ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి 17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నాయి.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 6h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.