మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ లో చంద్రబాబు

AP: పోలవరం జిల్లా రంపచోడవరం ప్రభుత్వ హైస్కూల్లో ఈరోజు మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు తరగతి గదిలో విద్యార్ధులు, వారి తల్లితండ్రులు, టీచర్లతో మాట్లాడారు. విద్యార్థుల చదువు పురోగతి, ప్రోగ్రెస్ రిపోర్టు కార్డును స్వయంగా పరిశీలించారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 ఫొటోఫ్రేమ్ వద్ద విద్యార్థులు, వారి తల్లితండ్రులతో ఫోటోలు దిగారు. కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు.



