← Back to news

కూతుళ్లే కొడుకులయ్యారు !

By డీకే· 20 Jun 2026· కోనసీమ జిల్లా
కూతుళ్లే కొడుకులయ్యారు !

AP: బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కే.జగన్నాథపురం గ్రామానికి చెందిన పిచ్చిక సత్యనారాయణ(52) తీవ్ర అనారోగ్యంతో మృతి చెందాడు. క్యాటరింగ్ పని చేస్తూ జీవనం సాగించే సత్యనారాయణకు మతిస్థిమితం లేని భార్య సత్యవతి ఉంది. మానసిక దివ్యాంగురాలైన సత్యవతికి సరైన వైద్యం అందక మతిస్తిమితం కోల్పోయింది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ప్రసన్న, జ్యోతిక, జ్యోత్స్నలు ఉన్నారు. అనారోగ్యంతో వాళ్ల నాన్న చనిపోవడంతో కుమార్తెలే అంత్యక్రియలు నిర్వహించారు.

More in AP