ఏపీలో మళ్లీ కరోనా టెన్షన్..!

AP: ఏపీలో Omicron RF.5 వేరియంట్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా 7 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 26కి చేరింది. ఇప్పటివరకు నలుగురు మృతి చెందగా, వారంతా ఇప్పటికే ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వైరస్ 10 జిల్లాలకు విస్తరించింది. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే టెస్ట్ చేయించుకోవాలని హెల్త్ డిపార్ట్మెంట్ సూచించింది.



