← Back to news

గొడ్డళ్లు, తుపాకీతో స్మగ్లర్స్.. అటవీశాఖ హైఅలర్ట్

By DK· 20 Jul 2026· మార్కాపురం జిల్లా
గొడ్డళ్లు, తుపాకీతో స్మగ్లర్స్.. అటవీశాఖ హైఅలర్ట్

AP: మార్కాపురం జిల్లా కనిగిరి రేంజ్ పరిధిలోని శేషాచలం కనుమల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ మళ్లీ అలజడి రేపింది. వెలిగండ్ల మండలంలో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న నలుగురు స్మగ్లర్లను అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి గొడ్డళ్లతో పాటు ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. వారు దాడులు చేసేందుకు ఆయుధాలు సమకూర్చుకోవడంతో అధికారులు షాక్ అయ్యారు. CSపురం, వెలిగండ్ల, హనుమంతునిపాడు మండలాల్లో 15 వేల హెక్టార్లలో ఎర్రచందనం చెట్లు ఉండటంతో అధికారులు అప్రమత్తమై నిఘా పెంచారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 16h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.